Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండ మెట్లబావి - దోమకొండకు యునెస్కో గుర్తింపు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు ఈ ఆవార్డులు వచ్చాయి. 
 
యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలకు ఆసియా - పసిఫిక్ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలోనే తాజాగా దేశంలోని పలు భవనాలకు ఈ అవార్డులు వరించాయి. 
 
ముఖ్యంగా తెలంగాణాలో గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ విభాగంలోనూ, దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. 
 
ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల్లో 50 చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, వీటి వడపోత తర్వాత ఆరు దేశాల్లో 13 కట్టడాలను ఐదు కేటిగిరీల్లో అవార్డుల్లో ఎంపిక  చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా, ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆప్ఘనిస్థాన్‌, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments