Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై వ్యామోహం... భర్తను వాహనంతో ఢీకొట్టించి చంపేసిన భార్య...

Webdunia
గురువారం, 16 జులై 2020 (14:16 IST)
ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా నూరేళ్లపాటు జీవించాల్సిన భార్యాభర్తల సంబంధాలు మరింతగా దిగజారిపోతున్నాయి. పరాయి పురుషులు లేదా స్త్రీల మోజులో పడిన భార్యలు లేదా భర్తలు కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. తాజాగా ఓ వార్డు మెంబరుగా ఉన్న ఓ మహిళ... ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను డీసీఎం వాహనంతో ఢీకొట్టించి చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మెడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్‌కు సమీపంలోని సైదొని గడ్డ తండాకు చెందిన సురేష్, బబిత అనే దంపతులు ఉన్నారు. అయితే, బబిత సైదోనిగడ్డ గ్రామ ‌7వ వార్డు మెంబరుగా ఉన్నారు. ఆమెకు దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి, భార్యను మందలించాడు. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పి, భర్త అడ్డు తొలగించాలని కోరింది.
 
దీంతో బబిత, ఆమె ప్రియుడు ప్రేమ్‌సింగ్ కలిసి సురేష్‌ను చంపాలని ప్లాన్ వేశారు. తమ కుట్రలో భాగంగా, ప్రేమ్‌సింగ్ తన స్నేహితులతో కలిసి ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో భారత్ బయోటక్‌లో పనిచేసే సురేష్.. విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా యాడారం వద్ద మే 23వ తేదీన డీసీఎం వాహనంతో ఢీకొట్టించారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి ఆస్పత్రికి కారులో తరలిస్తున్నట్లు నటించి దారిలోనే గొంతు పిసికి చంపేశారు. 
 
అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments