Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి మాజీ భార్య వద్దకెళ్లిన భర్త శవమై తేలాడు ఎలా?

అర్థరాత్రి పూట మాజీ భార్యతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన భర్త చివరకు శవమైతేలాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ మండలం చీటాకోడూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (14:31 IST)
అర్థరాత్రి పూట మాజీ భార్యతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన భర్త చివరకు శవమైతేలాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ మండలం చీటాకోడూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
 
యాదాద్రి జిల్లా కొలనుపాకకు చెందిన ఉదయ్‌ 2017లో జనగామ జిల్లా చీటాకోడూర్‌కు చెందిన గంధమాల మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల కాపురం అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు సిద్ధమయ్యారు. రెండు నెలల క్రితం పెద్ద మనుషులు ఇరువురికి విడాకుల తీర్మానం కుదర్చగా ఇది గ్రామపంచాయతీ పెద్దల వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
ఈనేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి వేళ విడాకులు కుదిరిన భార్యతో ఏకాంతంగా గడిపేందుకని ఉదయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఉదయ్‌ను చూడగానే ఆమె కేకలు వేసింది. దీంతో అతడి మామ, బావమరిది, ఇతర బంధువులు కలిసి ఉదయ్‌ను హత్య చేశారు. 
 
ఈ హత్య అర్థారత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగింది. సంఘటనతో అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు పరారీ కాగా మామ ఎల్లయ్య, బావమరిది తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments