Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లేడుతో గొంతు కోసుకున్న వీఆర్‌ఏ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగింది.
 
వేతన సవరణ, పదోన్నతలు సహా పలు డిమాండ్ల సాధనం కోసం ఆ రాష్ట్రానికి చెందిన వీఆర్ఏలు గత 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే, మంత్రు గానీ, అధికారులు గానీ వారి ఆందోళనపై కించిత్ కూడా లెక్కచేయలేదు. దీక్ష చేపట్టి రోజులు గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 
 
వీరిలో ఖాసిం అనే వీఆర్ఏ నెక్కొండ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన సహచరులు ఖాసింను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు స్పందిస్తూ, సమస్యల పరిష్కారం కోస నెలల తరబడిన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments