Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు.. తెలంగాణాలో విపరీతంగా మాంసం విక్రయాలు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (09:46 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. దీంతో ఈ రాష్ట్రంలో మాంసం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే గత నాలుగేళ్లలో మాంసం కోసం రూ.58,500 కోట్లను తెలంగాణ వాసులు వెచ్చించారు. 
 
దేశంలో అత్యధికంగా మాంసాహారం విక్రయిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసార పరిశోధనా సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. 
 
గత నాలుగేళ్లలో అమ్ముడైన మాంసం ధర కిలోకు సగటున రూ.600గా లెక్కిస్తే రూ.58,500 కోట్లకు మాంసం కోసం జనం వెచ్చించారు. ఇక గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.90 లక్షలకు పేగా గొర్రెలు ఉన్నాయి. 
 
రాష్ట్రంలో 2015-16లో గొర్రెలు, మేకలు మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులుగా ఉండగా, 2020-21 నాటికి అది రెండింతలై 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ యేడాది అది 3.50 లక్షల టన్నులకు చేరుకుందని అంచనా వేసింది. ఇందుకోసం తెలంగాణ వాసులు రూ.31 వేల కోట్లకు పైగా వెచ్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
దేశంలో గొర్రెలు, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలు అయితే, తెలంగాణాలో అత్యధికంగా 21.17 కిలోలుగా ఉంది. గొర్రెల పంపిణీ పథకం వల్ల కొత్తగా రూ.7920 కోట్ల సంపదను సృష్టించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments