Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకల్లేవ్!

Webdunia
గురువారం, 14 జులై 2022 (10:00 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. 
 
గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
 
వర్షాల వల్ల వాటిల్లిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా కారణాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, కొన్ని పశువులు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు. 
 
9 చెరువులకు గండ్లు పడగా, వాటిలో పడకల్ పెద్ద చెరువు వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. 42 ప్రాంతాల్లో రోడ్లపై నుండి వర్షపు జలాలు ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ దారి మళ్ళించామని మంత్రికి వివరించారు. 
 
నాలుగు చోట్ల రోడ్లు తెగిపోవడంతో సంబంధిత గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు.  
 
అయితే ఇంకను రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments