Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపై పడిన లారీలు

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ గోదావరి దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొట్టి పక్కనే వెళుతున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో దంపతులు, చిన్నారి వుంది. మరో చిన్నారి మాత్రం మృత్యువు నుంచి బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండానికి చెందిన షేక్ షకిల్, అతని భార్య రేష్మ, తన ఇద్దరు పిల్లలు కలిసి మంచిర్యాల జిల్లా ఇందారంలో తమ బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి ఒక ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. 
 
ఈ ఆటో గంగానగర్ వద్ద ఫ్లైఓవర్ యూటర్న్ చేస్తున్న సమయంలో బోగ్గులారీని ఫ్లైఓవర్ నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ పక్క నుంచి ఆటో వెళుతున్నది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న లారీపై పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments