మంత్రి శ్రీనివాస్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (09:37 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం... పాలమూరులోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్నారు. 
 
ఆయన కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం ఆయన పది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఆయన తన మేనమామ గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో నవీన్ ఊరికి వెళ్లి.. సోమవారం ఉదయం ఊరి నుంచి వచ్చారు. అయితే, ఫ్లాట్ తలుపులు మూసి ఉండటంతో తలుపు కొట్టినప్పటికీ ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఆయన తన వద్ద ఉన్న ఇంకో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లాడు. పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొకరలేదని పోలీసులు వెల్డలించారు. కాగా పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అనేక మంది నుంచి ఆయన డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పాటు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. 
 
దీంతో సెప్టెంబరు 30వ తేదీన అక్షయ్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వా బెయిల్‌పై బయటకు వచ్చిన అక్షయ్ హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నారు. అరెస్టు కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments