Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. తెలంగాణ టెన్త్ బోర్డ్ నిర్ణయం ఏమిటి..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:53 IST)
సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ బోర్డ్ పరీక్షలతో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. గురువారం విద్యా శాఖ అధికారులు పరీక్షలపై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.
 
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,307 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి మరో 897 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38లక్షలకు చేరింది. ఇప్పటివరకు 1,788 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో 27,861 కరోనా యాక్టివ్ కేసులుండగా, 3.08లక్షల మంది కరోనా భూతం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 18,685 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 446 మంది కోవిడ్-19 బారినపడినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments