Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. తెలంగాణ టెన్త్ బోర్డ్ నిర్ణయం ఏమిటి..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:53 IST)
సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ బోర్డ్ పరీక్షలతో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. గురువారం విద్యా శాఖ అధికారులు పరీక్షలపై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.
 
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,307 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి మరో 897 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38లక్షలకు చేరింది. ఇప్పటివరకు 1,788 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో 27,861 కరోనా యాక్టివ్ కేసులుండగా, 3.08లక్షల మంది కరోనా భూతం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 18,685 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 446 మంది కోవిడ్-19 బారినపడినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments