Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్ చేస్తానని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.. నా మృతికి మీరే కారణం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో కేవలం 50 శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. కరోనా వైరస్ కారణంగా ఈ పరీక్షలను తొలుత రద్దు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఆలస్యంగా నిర్వహించి, గురువారం ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
అయితే, ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రటించాడు. దీనికి కారణం ఆ ఇద్దరు మంత్రులేనంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ వెల్లడించాడు. 
 
తాను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానిని, ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇపుడు అందర్నీ ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. 
 
దీంతో క్షణాల్లో ఆ విద్యార్థిని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి, విద్యార్థి ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇంతలోనే ఆ విద్యార్థి తాను క్షేమంగా ఉన్నానని ఓ ట్వీట్ చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments