Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్ చేస్తానని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.. నా మృతికి మీరే కారణం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో కేవలం 50 శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. కరోనా వైరస్ కారణంగా ఈ పరీక్షలను తొలుత రద్దు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఆలస్యంగా నిర్వహించి, గురువారం ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
అయితే, ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రటించాడు. దీనికి కారణం ఆ ఇద్దరు మంత్రులేనంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ వెల్లడించాడు. 
 
తాను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానిని, ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇపుడు అందర్నీ ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. 
 
దీంతో క్షణాల్లో ఆ విద్యార్థిని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి, విద్యార్థి ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇంతలోనే ఆ విద్యార్థి తాను క్షేమంగా ఉన్నానని ఓ ట్వీట్ చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments