పావు గంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు అనుమతి

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (11:10 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి పావు గంట ఆలస్యమైన ప్రాక్టికల్స్ పరీక్షా హాలుకు అనుమతిస్తామని తెలిపింది. 
 
ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ల్యాబ్‌కు 15 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత మాత్రం అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, విద్యార్థులు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రాక్టిల్స్ నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. 
 
అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపక సిబ్బందిని కూడా విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ.5 వేల అపరాధం విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అలాగే, విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటల లోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపించాన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments