Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పరువు హత్య.. ప్రేమించాడని దాడి.. యువకుడి మృతి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (21:50 IST)
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌలు పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తమ తరపు అమ్మాయిని ప్రేమించాడని ఆమె తరపు కుటుంబ సభ్యులు మహేష్ అనే వ్యక్తి పై దాడి చేశారు. దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 25 రోజుల క్రితం దాడి చేయగా హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
 
ఇరవై ఐదు రోజుల క్రితం దాడిచేయగా ప్రథమ చికిత్స చేయించారు. గత కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. రక్తం గడ్డకట్టడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
 
అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్ల మహేష్ కు రక్తం గడ్డ కట్టి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అమ్మాయి తరపు బంధువులు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments