Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టి పొలాలపై పడిన తెలంగాణ ప్రభుత్వం: చుక్కలు చూస్తున్న భూముల ధరలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:05 IST)
ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే మద్యం ఏరులై పారుతుందని అంటుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాలు మద్యం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పిండుకునే పని ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను భారీగా పెంచేసింది.

 
రాష్ట్రంలోని అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ వ్యవసాయం, వ్యవసాయేతర, వాణిజ్యం వంటి అన్ని రకాల ఆస్తులపై మార్కెట్ విలువలను 15 శాతం నుంచి 60 శాతం వరకూ పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-2022లో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రూ.12,000 కోట్ల ఆదాయాన్ని పొందుతుందని, మార్కెట్ విలువల పెంపుదల తర్వాత మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

 
రిజిస్ట్రేషన్ కోసం భూమి విలువలను వ్యవసాయ ఆస్తులకు 50%, కొన్ని గ్రామాల్లో ప్రస్తుత ధరలపై 60%కి పెంచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రభుత్వం నిర్ణయించిన కనీస భూమి ధరల ఆధారంగా 7.5% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండింటినీ సేకరిస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచింది.

 
పెంచిన భూముల ధరల ప్రకారం వ్యవసాయ ఆస్తులకు ఎకరానికి రూ. 75,000 రిజిస్ట్రేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న కనీస రేటు ఎకరాకు రూ. 1.50 లక్షలకు పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విలువలపై 35%, ఫ్లాట్లపై 15% నుండి 25% వరకు రేట్లు పెంచే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments