Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఒంటిపూట బడులు

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (13:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఈ యేడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతున్న విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం ముందుగానే ఒంటిపూట బడులు పెట్టేందుకు మొగ్గు చూపింది. 
 
విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించింది. 
 
మరోవైపు, పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా వారికి మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపింది. పదో తరగతి పరీక్షలు జరిగే బడుల్లో మాత్రం ఒంటిపూట బడులు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments