Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 30 నుంచి ఎంసెట్ తొలి దశ కౌన్సిలింగ్

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:14 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్‌ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన టీఎస్‌ ఎంసెట్‌-2021 అడ్మిషన్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుని, కౌన్లింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. 
 
ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల స్లాట్‌ బుకింగ్‌. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 
 
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబ్‌ 15 నుంచి 20వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సిందిగా సూచన. మరిన్ని వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌ https://tseamcet.nic.in లో ఆగస్టు 28వ తేదీనుండి లభించనున్నట్లు అడ్మిషన్స్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments