Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష పెదవులపై గాట్లు, తలపై గాయాలు... కొట్టి చంపి ఉరి వేశారా?, లింకుందన్న తేజస్విని ఎవరు?

బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో ఆమె మెడ ఎముక విరిగి చనిపోయినట్లు తేలింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. కంటి మీద, పెదవులపైన, తలపైన గాయాలయ్యాయి. పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఆమెను హత్య చేసి,

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (19:08 IST)
బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో ఆమె మెడ ఎముక విరిగి చనిపోయినట్లు తేలింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. కంటి మీద, పెదవులపైన, తలపైన గాయాలయ్యాయి. పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఆమెను హత్య చేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాగా ఆమె ఉరి వేసుకోవడం వల్లనే చనిపోయిందా లేదా అన్నది తేలాల్సి వుంది. 
 
ఇదిలావుంటే రాజీవ్-శిరీష్‌ల మధ్య సన్నిహిత సంబంధం వున్నదంటూ తేజస్విని అనే యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో కేసు పెట్టినట్లు బయటకొచ్చింది. తేజస్విని అనే యువతి రాజీవ్ ను పెళ్లాడాలనుకున్నదనీ, ఐతే శిరీష-రాజీవులిద్దరూ సన్నిహితంగా వున్నట్లు అనిపించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కేసు వరకూ వెళ్లిందంటున్నారు. ఈ కేసును పరిష్కరించుకునేందుకు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు వెళ్లగా మరో రెండు రోజుల తర్వాత చూద్దాం అని అక్కడి పోలీసులు చెప్పి పంపారు.
 
ఈ క్రమంలోనే శ్రావణ్ అనే వ్యక్తి లైన్లోకి వచ్చాడు. తనకు కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి బాగా తెలుసుననీ, అక్కడ కేసు పరిష్కరించుకుందామని వారిని అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళుతూ మార్గమధ్యంలోనే బీరు తీసుకుని సేవించారు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో రిసార్టుకు వెళ్లారు. ఆ రిసార్టులోనే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. 
 
శిరీష పట్ల ఎస్సై ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసిందనీ, వారించినా వినకుండా గట్టిగా కేకలు వేస్తుండటంతో రాజీవ్ ఆమెపై చేయి చేసుకున్నాడని సమాచారం. ఐతే ఈ క్రమంలోనే ఆమెను కొట్టి చంపేసి, శవాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే కేసు పెట్టిన తేజస్విని ఇంతవరకూ ఎవరనేది వెలికి రాలేదు. ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది బయటకు రావాలని శిరీష తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోస్టుమార్టమ్ నివేదిక పూర్తి వివరాలు వెలికి వస్తే కానీ అసలు సంగతి తెలియదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments