Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారు : రాహుల్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:33 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ ట్వీట్ చేశారు. మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణాలో పర్యటిచారు. ఈ పర్యటనలోభాగంగా, వరంగల్‌ సభలో చేసిన డిక్లరేషన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు తీవ్ర దుమారాన్ని రేపింది. 
 
తెలంగాణాను దార్శనికుడైన కేసీఆర్ పరిపాలనిస్తున్నారని, మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గోటికి కూడా ప్రకాష్ రాజ్ సరిపోరని కామెంట్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని, రాజ్యసభ సీటు కోసం వెంపర్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఒక్క రోజు కూడా ప్రకాష్ రాజ్ ప్రజల్లోకి రాలేదని అసలు కేసీఆర్ గురించి ప్రకాష్ రాజ్‌కు ఏం తెలుసని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments