Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:47 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసైతో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా 8 లక్షల కోట్లు ప్రజాధనం కేసీఆర్ దోచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
మునుపు తను ఎప్పుడు వచ్చినా ఎంతో గౌరవంతో మాట్లాడే కేసీఆర్ కళ్లు ఇప్పుడు నెత్తికెక్కాయనీ, కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకే అమెరికా నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెరాసకి 30 సీట్లు కూడా రావని అన్నారు. ఈ మాట తను చెప్పడంలేదనీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియకు ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.

 
ఇక ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ చేసిన అప్పులను తీర్చేందుకు కనీసం 20 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. మొత్తమ్మీద అటు కేసీఆర్ పైన ఇటు జగన్ పైన కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments