Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం విరాళమిచ్చిన సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (16:18 IST)
తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి కేసీఆర్ దంపతులు కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. 
 
శుక్రవారం ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడైన హిమాన్షు అందజేశారు. స్వామి వారి దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, సునీత, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments