Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పీఆర్పీని అంతా మర్చిపోతుంటే కేసీఆర్ మర్చిపోవడంలేదు...

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అంతా మరిచిపోతున్నప్పటికీ కేసీఆర్ మర్చిపోవడంలేదు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం పైన ఓ రేంజిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవని

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (18:12 IST)
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అంతా మరిచిపోతున్నప్పటికీ కేసీఆర్ మర్చిపోవడంలేదు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం పైన ఓ రేంజిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవని కోదండరామ్ మాకు పాఠాలు చెప్పడమా అంటూ మండిపడ్డారు. 
 
అంతేకాదు... గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి కోదండ‌రామ్ ఆ పార్టీకి మేనిఫెస్టో రాసిండనీ, ఆ పార్టీ ఏమైందో అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. అంతెందుకు చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు ఆ పార్టీని ఏం చేసిండ్రు... ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు ప‌డేయలేదా అంటూ ఎద్దేవా చేశారు. 
 
ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ఆయనకు జనంలో ఎంతో విశ్వసనీయత వున్నదనీ, అందువల్ల ఆయన మనగలిగారని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోదండరామ్ స్పందించేందుకు నిరాకరించారు. ఆయన వ్యాఖ్యలపై రేపు టి.జేఏసి సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments