Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మాటే శాసనం... హరీశ్-ఈటెలకు మొండిచెయ్యేనా? గోళ్లు కొరుకుతున్నారు...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (19:28 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ముహూర్తాన్ని ఫిక్స్ చేసేశారు కూడా. మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన వారికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. ఐతే గత మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించిన హరీశ్ రావు, ఈటెలకు మాత్రం ఇప్పటివరకూ విషెస్ రాలేదట. దీనితో సదరు మాజీ మంత్రుల మద్దతుదార్లు టెన్షన్ తట్టుకోలేక గోళ్లు కొరుక్కుంటున్నారట. 
 
బయటకు ఏమైనా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం కూడా వుండనే వుంటుంది. అందులోనూ కేసీఆర్ అంటే మాటలు కాదు... ఆయన మాటే శాసనం అంటుంటారు తెరాస నాయకులు. కాబట్టి మంత్రివర్గంలో బెర్తు కన్ఫర్మ్ అయ్యేవరకూ అలా గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడమో లేదంటే అలా గోళ్లు కొరుక్కోవడం తప్పించి ఏమీ చేయలేం అంటున్నారు. 
 
మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి కూడా ఇప్పటివరకూ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. దీన్నిబట్టి చూస్తుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు హేమాహేమీలు కేంద్రంలో మంత్రి పదవుల్లో అలంకరిస్తారని అనిపించడంలేదూ.... ఏమంటారు?

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments