నేటితో ముగియనున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (11:52 IST)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. చివరిరోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చజరగనుంది. ఈనెల 7 నుంచి ప్రారంభమైన సమావేశాల్లో అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఆ తర్వాత నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరిగింది. మొత్తం 37 పద్దులు శాసనసభ ఆమోదం పొందాయి. 
 
సమావేశాల చివరిరోజైన నేడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చించనున్నారు. శాసనసభ ఆమోదించిన ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. 2020 మార్చితో ముగిసిన సంవత్సరానికి కాగ్ నివేదికలను శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments