తెలంగాణ ఇంటర్ విద్యర్థులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం (డిసెంబర్ 15)న విడుదల కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. 
 
									
										
								
																	
	 
	అలాగే ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ఇంతకుముందు నిర్ణయించింది. ఈ క్రమంలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	కాగా మరోవైపు వచ్చే ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 2022 మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు జరగాలి. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	అయితే ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.