Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల బరిలో సుహాసిని.. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారా? లేదా?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (09:53 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమె శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఆమె వెంట సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పార్టీ నేతలు ఉండనున్నారు. ముందుగా అంటే శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు, తన తండ్రి సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులు అడిగి ప్రశ్నలకు సమాధానమిస్తూ, తనకు మద్దతుగా తన తమ్ముళ్లు టాలీవుడ్ హీరోలు అయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రచారం చేసే విషయంపై తుది నిర్ణయం వారిదేనని చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తామన్నారు. అదేసమయంలో తనను ఎన్నుకుంటే ప్రజల కోసం అనునిత్యం కష్టపడతానని చెప్పారు. 
 
కాగా, హైదరాబాద్ నగరంలో సెటిలర్లు అధికంగా నివశించే కూకట్‌పల్లి స్థానం నుంచి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, వారు ప్రచారానికి వస్తారా రారా అనే అంశంపై స్పష్టత మాత్రం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments