Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా.. డేంజర్ బెల్స్ జారీ

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:21 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2వేల 331 కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురము, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత విశాఖపట్నంలో 298మంది, చిత్తూరు జిల్లాలో 296 మందికి కరోనా సోకింది.
 
తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దాదాపు రెండు వేల మందికి వైరస్‌ సోకింది. ఐదుగురు కరోనాకు బలయ్యారు. తెలంగాణలో మొత్తం 11వేల 617యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 393మంది కరోనా బారిన పడ్డారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ వారం రోజుల్లోనే 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయ్‌. కరోనాపై మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ.

అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని మంత్రి ఈటెల చెప్పుకొచ్చారు. కరోనా తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments