Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నమెంట్ స్కూల్‌లో చేరితే రూ.5 వేల నగదు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (10:12 IST)
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మాయాజాలం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. ఈ పాఠశాలలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. పైగా, విద్య కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో చర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5 వేలు ఇస్తామంటూ సర్పంచి ఆకిటి మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచి ఆంజనేయులు ప్రకటించారు.
 
అంతేకాకుండా, దాతల సాయంతో అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. అంతేకాక విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బస్‌పాస్‌ అందిస్తామని పేర్కొన్నారు. ప్రకటించిన నజరానాల వివరాలతో పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments