Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు - ఉపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (10:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికితో పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేషన్ జూన్, జూలై నెలల్లో ఇవ్వనుంది. జూన్ నెలలో 15 కేజీల బియ్యం, జులైలో 5 కేజీల బియ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో 10 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 
 
ఆహారభద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎప్పటిలాగే ఇచ్చే 6 కిలోలకు మరో తొమ్మిది కలిపి 15 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. వచ్చే నెల ఇచ్చే బియ్యంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 87.42 లక్షల రేషన్‌ కార్డుదారులైన 2.79 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments