Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు - ఉపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (10:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికితో పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేషన్ జూన్, జూలై నెలల్లో ఇవ్వనుంది. జూన్ నెలలో 15 కేజీల బియ్యం, జులైలో 5 కేజీల బియ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో 10 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 
 
ఆహారభద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎప్పటిలాగే ఇచ్చే 6 కిలోలకు మరో తొమ్మిది కలిపి 15 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. వచ్చే నెల ఇచ్చే బియ్యంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 87.42 లక్షల రేషన్‌ కార్డుదారులైన 2.79 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments