Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి మృతుడి తలతో స్టేషన్‌లో లొంగిపోయిన బావమరుదులు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (15:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. 26 యేళ్ల వ్యక్తిని ఇద్దరు బావమరుదులు అతి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, దాన్ని పట్టుకుని స్టేషన్‌కెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండల పరిధిలోని నేరళ్లపల్లికి చెందిన సద్దాం హుస్సేన్ (25) అనే వ్యక్తి హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనుముల మండలం మారేపల్లికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఈమెకు సద్దాం హుస్సేన్‌ పరిచమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ సహజీవనం కొనసాగిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ గత 2017లో ఆత్మహత్య చేసుకుంది. అయితే, తమ అక్క చావుకు సద్దాంహుస్సేన్ కారణమని భావించిన ఆమెకు వరుసకు సోదరులైన ఇర్ఫాన్, గౌసుద్దీన్ అతడిపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి నాంపల్లి రచ్చబండ వద్ద సద్దాం తారసపడగా వేట కొడవలితో నరికి చంపారు. అనంతరం తలను వేరు చేసి చేతిలో పట్టుకొని నాంపల్లి పోలీ‌స్ స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు మర్రిగూడ సీఐ గౌరీనాయుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments