Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించాక కొత్తిమీర రసం తాగితే...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (14:45 IST)
మద్యంబాబులు సరికొత్త ఎత్తుగడ వేశారు. పీకల వరకు మద్యం సేవించినా బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త టెక్నిక్ అనుసరిస్తున్నారు. ముఖ్యంగా, మద్యం సేవించిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిమ్మరసం లేదా కొత్తిమీర రసం తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరని గట్టిగా భావిస్తున్నారు. 
 
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పోలీసులు రోడ్లపై కనిపిస్తే చాలు... మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తున్నారు. 
 
వాస్తవానికి గతంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారని కనిపిస్తే, మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తుంటారు. మరికొంత మంది మాత్రం మద్యం సేవించిన తర్వాత నిమ్మరసం లేదా కొత్తిమీర రసం సేవిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరన్నది వారి నమ్మకం. ఆ నమ్మకంతో పోలీసుల ముందుకు వెళ్లి, అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ కారణంతోనే మే నెలలో అత్యధికులు పట్టుబడినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ జ్యూస్‌లతో మద్యం తాగినట్టు వాసన రాకపోవచ్చుగానీ, 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 గ్రాములకు మించిన ఆల్కహాల్ ఉంటే పట్టేస్తామని పోలీసులు అంటున్నారు. మందు కొట్టిన తర్వాత ఏ జ్యూస్ తాగినా, పాన్, పాన్ మసాలాలు నమిలినా అది శ్వాస పరీక్షను ప్రభావితం చేయబోదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments