Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (17:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్ మల్లన్నకు చెందిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఈ కార్యాలయంలోనే ఆయన క్యూ న్యూస్‌ అనే పేరుతో ఓ న్యూస్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 
 
దాడి తర్వాత సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. దాడి ఘటన సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేకపోవడంతో ఆయనకు ప్రాణముప్పు తప్పింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments