Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్వలో బోల్తాపడిన బస్సు - 17 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (16:54 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని సోనాదంగా నుంచి ఆ దేశ రాజధాని ఢాకాకు 40 మంది ప్రయాణికులతో కలిసి ఆదివారం ఉదయం ఒక బస్సు బయలుదేరింది. ఇది మమదరిపూర్ అనే ఏరియాలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించాల్సివుంది.
 
మరోవైపు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం, బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు  భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments