Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:58 IST)
ప్రముఖ యాంకర్, న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను గత ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
అదేసమయంలో తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా గుప్పించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదైవున్నాయి. వీటిలో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. మిగిలిన ఒక్క కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, తీన్మార్ మల్లన్న గత 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరైంది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments