ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:58 IST)
ప్రముఖ యాంకర్, న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను గత ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
అదేసమయంలో తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా గుప్పించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదైవున్నాయి. వీటిలో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. మిగిలిన ఒక్క కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, తీన్మార్ మల్లన్న గత 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments