Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:58 IST)
ప్రముఖ యాంకర్, న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను గత ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
అదేసమయంలో తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా గుప్పించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదైవున్నాయి. వీటిలో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. మిగిలిన ఒక్క కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, తీన్మార్ మల్లన్న గత 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments