Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 11 వేల కొత్త కేసులు.. 13 వేల రికవరీలు

Advertiesment
cases
, సోమవారం, 8 నవంబరు 2021 (10:24 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 8,70,058 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,451 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ముందురోజు కంటే 5.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. అలాగే నిన్న 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,61,057 మంది మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. క్రియాశీల రేటు గతేడాది మార్చి నాటి కనిష్ఠానికి చేరగా.. రికవరీ రేటు అప్పటి గరిష్ఠానికి చేరింది.

ప్రస్తుతం 1,42,826 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 0.42 శాతానికి చేరింది. నిన్న 13,204 మంది కోలుకోగా.. మొత్తంగా 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.
 
పండగల సీజన్, ప్రభుత్వ సెలవులు కారణంగా గత నెల నుంచి టీకా కార్యక్రమం నెమ్మదించింది. నిన్న 23,84,096 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 108 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి అనుమానాస్ప‌ద మృతి... ఆ ఇద్ద‌రు యువ‌కులూ...