Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుపూజోత్సవం, పూజలందుకోవాల్సిన గురువు బైక్ మెకానిక్‌గా...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:12 IST)
ఉన్నత చదువులు చదివిన ఆ ఉపాధ్యాయుడు గురు పూజోత్సవం రోజున గురువు గౌరవాన్ని అందుకోవాలి కానీ కరోనా పుణ్యాన ఉపాధి కోల్పోయిన గురువు, కుటుంబ పోషణ కోసం బైక్ మెకానిక్‌గా మారాల్సిన దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.
 
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన  రవీందర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాదులో ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రతి ఏడాది గురుపూజోత్సవం రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించేవారు. ఉపాధ్యాయుడుగా ఆరోజున పొందే తృప్తి జీవితంలో మరుపురాని జ్ఞాపకంలా ఉండేది.
 
ఇప్పుడు కరోనా పుణ్యాన కళాశాలలు మూతపడి ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ కోసం ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టిన ఆ గురువు బైక్ మెకానిక్ మారాడు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుని ఈవిధంగా చూడాల్సి రావడం విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలచివేస్తోంది. కరోనా మహమ్మారి తొలగిపోయి మరలా తిరిగి మంచి రోజులు రావాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments