Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదాలా?

Teacher
Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (19:37 IST)
ఓర్పుతో వుండాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పుకే విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను టీచర్ చితకబాదింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. టీచర్ రాజ్యలక్ష్మి చెప్పులకు మట్టిందని ఆరుగురు విద్యార్థులను కర్రతో గొడ్డును బాదినట్లు బాదింది. దీంతో విద్యార్థులకు గాయాలైనాయి. మానకొండూరు గ్రామంలో వర్షాల కారణంగా బురదమయం అయ్యింది. దీంతో విద్యార్థులు బురదలోనే నడవాల్సిన పరిస్థితి. 
 
ఇలా చెప్పులకు బురద అంటుకుంటోంది. దీన్ని చూసిన టీచర్ వారిపై విచక్షణా రహితంగా ప్రవర్తించింది.  కర్ర తీసుకుని విద్యార్థులను చితకబాదింది. విద్యార్థులను అకారణంగా చితకబాదిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హెచ్ఎంను డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments