విరసం నేత వరవర రావుకు షరతులతో బెయిల్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (14:11 IST)
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కేసులో ఆయనకు అపెక్స్ కోర్టు బుధవారం ఈ బెయిల్ మంజూరుచేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
 
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూయూ లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. 
 
కాగా, ఈయన గత రెండున్నరేళ్లుగా కస్టడీలో ఉన్నారు. అలాగే, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో ఇంకా విచారణ మొదలుకాలేదు. చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
అయితే, ముంబైలో ఎన్.ఐ.ఏ కోర్టు అనుమతి లేకుండా ఆయన గ్రేటర్ ముంబైను దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే, ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని స్పష్టంచేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments