Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వయస్సులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (13:21 IST)
70 ఏళ్ల వయస్సులో తొలిసారిగా మగబిడ్డకు జన్మనిచ్చారు.. రాజస్థాన్ మహిళ. దీంతో తల్లిదండ్రులు కావాలన్న తమ కలను పెళ్లైన 54 ఏళ్ల తర్వాత నెరవేర్చుకుంది ఆ జంట.
 
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన చంద్రావతి-గోపీ సింగ్ అనే జంటకు పెళ్లై 54 ఏళ్లైనా సంతానం లేదు. ప్రస్తుతం గోపీ సింగ్ వయసు 75 కాగా, చంద్రావతి వయసు 70. వీరిద్దరూ సంతానం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో ఆల్వార్ జిల్లాలో ఉన్న ఒక ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్‌ ద్వారా ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించారు. మూడోసారి ఆ ట్రీట్మెంట్ విజయవంతమైంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఐవీఎఫ్ విధానంలో చంద్రావతి గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ ఆమె వయసు ఎక్కువ కావడం వల్ల సంతానం విషయంలో వైద్యులు కొంత సందేహించారు. అయితే, ఏ ఇబ్బందీ లేకుండా గత సోమవారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. బిడ్డ దాదాపు మూడున్నర కేజీల బరువున్నట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments