ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. దీపావళికి ప్రత్యేక రైళ్లు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (13:57 IST)
దీపావళి పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్యరైల్వే నిర్ణయించింది. ఆ ప్రత్యేక రైళ్లనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్‌ నెంబర్‌ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నెల నవంబర్ 2వ తేదీ మంగళవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇక ఈ రైలు ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.
 
రైలు నెంబర్‌ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలు 03వ తేదీన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ఆ రోజు 19.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీన 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments