Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. దీపావళికి ప్రత్యేక రైళ్లు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (13:57 IST)
దీపావళి పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్యరైల్వే నిర్ణయించింది. ఆ ప్రత్యేక రైళ్లనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్‌ నెంబర్‌ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నెల నవంబర్ 2వ తేదీ మంగళవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇక ఈ రైలు ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.
 
రైలు నెంబర్‌ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలు 03వ తేదీన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ఆ రోజు 19.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీన 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments