Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వేల పెన్షన్ కోసం.. కన్నతల్లినే కడతేర్చాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (15:47 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు కోసం ఎంత నేరాలనైనా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా కన్నతల్లికి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు పెన్షన్ డబ్బుకు కక్కుర్తిపడ్డాడు. అంతే కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. తల్లిని కన్నకొడుకే అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు వెల్లడించారు. 
 
తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను నిత్యం వేధించేవాడని చెప్పారు. శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పెన్షన్ డబ్బు రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పెన్షన్ డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments