Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. రూ.37లక్షలు గుంజేశాడు.. ఆపై పరార్

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:00 IST)
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఓ యువకుడు. అంతే కాకుండా సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37లక్షలు గుంజేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన మహిళ (26) రెండేళ్ల క్రితం విప్రో సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ టీం లీడర్‌గా పని చేస్తున్న మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన జై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
 
ఈ క్రమంలో సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆయువతి వద్దనుంచి జై రూ.37 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 3న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
బాధిత యువతి కేసు పెట్టిందని తెలుసుకున్న జై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. జై కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments