Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. రూ.37లక్షలు గుంజేశాడు.. ఆపై పరార్

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:00 IST)
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఓ యువకుడు. అంతే కాకుండా సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37లక్షలు గుంజేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన మహిళ (26) రెండేళ్ల క్రితం విప్రో సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ టీం లీడర్‌గా పని చేస్తున్న మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన జై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
 
ఈ క్రమంలో సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆయువతి వద్దనుంచి జై రూ.37 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 3న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
బాధిత యువతి కేసు పెట్టిందని తెలుసుకున్న జై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. జై కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments