Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి బొగ్గు గనుల్లో మోగిన సమ్మె సైరన్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (13:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మె సైరెన్ మోగింది. ఇదే అంశంపై సింగరేణి యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరించబోతుందన్న వార్తల నేపథ్యంలో వారు సమ్మెకు దిగనున్నారు. 
 
ఇందులోభాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో సమ్మె చేబట్టబోతున్నామని సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేసిన సమ్మె నోటీసులు అందించారు. 
 
సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును నల్లబంగారంతో పోల్చుతారు. దీన్ని తవ్వే సమయంలో బొగ్గు గనుల్లో ఏర్పడే ప్రమాదాల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు పని చేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీస్తున్నారు. 
 
అలాంటి నల్ల బంగారం గనులను కేంద్రం ప్రైవేటీకరించాలని చూస్తోంది. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై తమ నిరసన తెలిపేందుకు వీలుగా ఈ నెలాఖరులో రెండు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించి, నోటీసులు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments