భార్య తల నరికి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేసిన భర్త!!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కసాయిగా మారిపోయాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్య తల తెగనరికేశాడు. ఆ తలను తీసుకెళ్లి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేశాడు. ఈ భయానక దారుణం గురించిన వివరాలను పరిశీలిస్తే... 
 
నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 50 ఏళ్ల సాయిలు ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెను మానసికంగా వేధిస్తూ, గొడవపడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అపుడు కసితో రగిలిపోయిన సాయిలు... భార్య తలను గొడ్డలితో నరికాడు. రక్తమోడుతున్న భార్య తలతో బైకుపై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, ఆ తలను తీసుకువెళ్లి, భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను అనుమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంటి గుమ్మంలో పడేశాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాయిలును అరెస్ట చేశారు. స్థానికంగా ఈ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments