Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో ఏడో తరగతి చదువుతున్న బాలిక మృతి.. దసరా సెలవులకు వచ్చి..?

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:43 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగాయి. పిల్లలతో పాటు శారీరకంగా దృఢంగా ఉన్నవారిలోనూ గుండెపోటు వస్తోంది. ఇటీవల ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కంజర గ్రామానికి చెందిన ఆదరంగి మైథిలి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మైథిలీ అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
 
దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి తనకు ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments