Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా సెలవులకు ఇంటికొచ్చిన విద్యార్థిని గుండెపోటుతో మృతి

deadbody
, సోమవారం, 16 అక్టోబరు 2023 (08:58 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి బాలిక ఒకరు గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ బాలిక ఇంటితో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పగా తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కన్నుమూశారు. 
 
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంజర గ్రామానికి చెందిన అదరంగి మైథిలి అనే బాలిక ఏడో తరగతి చదువుతుంది. ఆమె అక్క గ్రేసీ కూడా అక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.
 
దీంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని మైథిలి తల్లికి చెప్పింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించరు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులో చంద్రబాబు ఎలా ఉన్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి?