Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి

Advertiesment
Inter Girl Died
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. విష జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఈ బాలిక చనిపోయిందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కలకలం రేగింది. ఈ వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో నలుగురు చనిపోగా మరికొంత మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక విషజ్వరంతో చనిపోవడం గమనార్హం. 
 
ఆ బాలిక హన్మకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు వారం రోజులుగా జ్వరం వస్తూపోతుంది. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. విషజ్వరంతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలొకంది. మృతురాలిని ఆరేపల్లి గ్రామ పరిధిలిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం రజితల పెద్ద కుమార్తె అశ్వితగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ADR రిపోర్ట్: పార్లమెంటు సభ్యుల్లో తెలుగు ఎంపీలే సూపర్ రిచ్, నేర చరిత్రలోనూ మనవారే టాప్