Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు సర్వీస్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (12:43 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా విశాఖపట్టణం వరకు ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. త్వరలోనే మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తుంది. వచ్చే నెలలో ఈ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ రైలు దేశంలో నడుపనున్న తొమ్మిదో వందే భారత్ రైలు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. వచ్చేనెల 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలు సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందుకోసం రూట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా, ఒంగోలుకు రూ.5.20 గంటలకు, చీరాలకు రూ.6.25 గంటలకు విజయవాడకు 8.25 గంటకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments