స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:25 IST)
సికింద్రాబాద్‌ స్పోర్ట్స్‌ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లోని డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులు బీహార్‌కు చెందిన జునైద్, వసీం, జాహెద్‌లుగా గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేనంతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షాప్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ మంటలు చెలరేగాయి. వెంటనే పై అంతస్తులకు వ్యాపించాయి. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భవనంలో అగ్నిమాపక సిబ్బంది 10 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పారు.
 
భవనంలో చిక్కుకున్న 10 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు తొలుత రక్షించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక అధికారులు, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాలను ఖాళీ చేయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !

Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments