Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదం.. పది మంది మృతి

road accident
, శుక్రవారం, 13 జనవరి 2023 (11:53 IST)
మహారాష్ట్రలో నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కును ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరిలంచారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. థానే, ఉల్లాస్ నగర్, అంబేర్‌నాథ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు బస్సులో షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రమాదంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మహత్య చేసుకున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు