సికింద్రాబాద్‌లో నాలాలో పడిన ఏడేళ్ళ బాలుడు..

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:24 IST)
తెలంగాణాలోని సికింద్రాబాద్ నగరంలో విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్థానిక బోయినపల్లికు చెందిన ఏడేళ్ళ ఆనంద సాయి అనే బాలుడు చిన్నతోకట్ట నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచెత్తింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్ బోయినపల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పడిపోయాడు. ఆ సమయంలో మురుగునీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు. 
 
దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments