Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరిగిన శునకం.. భయంతో మూడో అంతస్థు దూకేశాడు.. పరిస్థితి విషమం

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (17:10 IST)
ఫుడ్ డెలివరీ బాయ్ మూడో అంతస్థు నుంచి దూకేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ బాయ్‌కి పెంపుడు కుక్క మొరగడంతో భయంతో భవనం మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న మహ్మద్ రిజ్వాన్ (23) పార్శిల్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనానికి వెళ్లాడు. ఫ్లాట్ తలుపు తట్టినప్పుడు, ఒక జర్మన్ షెపర్డ్ శునకం అరుస్తూ అతని వైపుకు వచ్చింది. 
 
దీంతో భయంతో రిజ్వాన్ మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆపై ఫ్లాట్ యజమాని శోభన అంబులెన్స్‌కు ఫోన్ చేసి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి తరలించారు.
 
నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన రిజ్వాన్‌ పరిస్థితి విషమంగా ఉంది. రిజ్వాన్ సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments